Advertisement

కొత్తపేటలో వైభవంగా జరిగిన కాపు వన సమారాధన

  • సంఘ అభివృద్ధికి ఐక్యత అత్యవసరం : ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 16 : కొత్తపేట బండారు బులిసత్యం–చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాపు వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తికమాస వన సమారాధనల వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక పావనతను, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మనస్సుకు శాంతి, సమాజానికి ఐక్యత, సంఘంలో శ్రేయస్సు—ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత బలపడతాయని తెలిపారు. సంఘ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలంటే ప్రతి సభ్యుడు ఒకే దారిలో, ఒకే ఉద్దేశంతో కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు. పేద సభ్యులకు తోడ్పాటు, సేవా కార్యక్రమాల విస్తరణ, యువతలో సంఘ భావన పెంపొందించడం వంటి అంశాల్లో సంఘం చురుకుగా వ్యవహరిస్తోంది అని అభినందించారు. సంఘం బలపడాలంటే అందరి సహకారం కీలకమని, సమాజం సమగ్ర అభివృద్ధి కోసం ఐక్యతే మూలస్తంభమని ఎమ్మెల్యే అన్నారు. సభ్యులంతా పరస్పరం అండగా ఉంటే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడం సులభమవుతుందని చెప్పారు. తదుపరి కార్యక్రమంగా నిర్వహించిన భారీ అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించి, అతిథులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *