పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న(మంగళవారం) ఖమ్మం జిల్లా కారేపల్లిలో 7.0 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాల కారణంగా రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు.. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఉత్తర, వాయువ్య దిశల నుండి గాలులు వీస్తున్నాయి.
ఈ వాతావరణ పరిస్థితుల మొత్తం ప్రభావం కారణంగా.. రానున్న 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 5వ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వర్షాల దృష్ట్యాజ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
















Leave a Reply