Advertisement

ఏడుకొండలస్వామితో పెట్టుకున్న వాళ్లు అడ్రస్సు లేకుండా పొయారు

– కల్తీ నెయ్యి చేసిన వాళ్ళు మట్టికొట్టుకు పోవడం ఖాయం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : తిరుమల తిరుపతిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏడుకొండల వెంకటరమణ గోవిందుల వారి హిందువుల పవిత్ర దేవాలయంను అపవిత్రం చేయాలని వక్ర బుద్ధితో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మత విస్వశాలకు, శ్రీవారి భక్తుల మనోభావాలకు పూర్తిగా వీఘాతం కల్గించారు. శ్రీవారి సన్నిధిలో ఆ దవుర్భాగ్యులు చేసిన ఆగడాలు ఒకొక్కటి బయట పడుతున్నాయి. హిందు మతం పై ఎటువంటి విశశ్వాసం లేని, స్వామివారిని ఏమాత్రం కొలవని అన్య మతస్తులు కరుణాకర రెడ్డీ, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి లాంటి నాస్తికులను టీటీడి చైర్మన్లుగా, ఈవోగా జగన్ నియమించారు. రౌడిజాం, గుండగిరి నమ్ముకుని ఏ మతము పై అస్సలు విశ్వాసం లేని జగన్ రెడ్డి ఆ ముగ్గురు అన్య మతస్తులను హిందూ మతము పై విశ్వాసం లేని తన బంధువులు, మిత్రులను నియమించి వారిచే పవిత్ర మైన టీటీడి సంస్థను కుట్ర పూరీతంగా ఆపవిత్రం చేసారు అని మండపేట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో ఇలా కుట్రలు పన్ని ఏడుకొండల వాడితో పెట్టుకున్న వాళ్లు ఏడ్రస్సు లేకుండా పొయారుఅని అన్నారు. భక్తులు ఎంతో భక్తితో పవిత్ర ప్రసాదంగా తినే తిరుపతి లడ్డును తన అక్రమ సంపాదన కోసం దైవ ప్రసాదని వదలకుండా ఏ మాత్రం మత విశ్వసాలు లేని మానవ మృగాలతో ప్రసాదం లడ్డులో సబ్బులు, పెయింట్ వాడే రసయనాలతో నెయ్యి వాసన వచ్చే లిక్విడ్ ను కలిపి, కల్తీ నెయ్యి తయారు దారులతో కుమ్మకు అయి రూ.250 కోట్లకు పైగా దేవాలయం సొమ్మునే దోచుకున్నారన్నారు. ఇలాంటి నెయ్యి కల్తీ గాళ్ళను వెనకేసుకుని వస్తున్నా, సొమ్ము దోచుకున్న దోపిడీ దారులను సహకరించిన, సపోర్ట్ చేసిన వారిని ఆ ఏడుకొండల వాడి శిక్ష నుండి తప్పించు కోలేరు. ఎంతో మంది ఏడుకొండలవాడితో పెట్టుకున్న వాళ్లు అడ్రస్సు లేకుండా పోయారు. మత విశ్వాసం లేని ఈ కల్తీ నెయ్యి గాళ్లు, వీరికి సహకరించిన వారు త్వరలో మట్టికొట్టుకు పోవడం ఖాయం అని మండపేట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *