తెలంగాణ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబిసి విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్ సోమ్ము జమ కానుంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందిస్తున్న ఎస్సీ విద్యార్థుల తరహాలో మిగతా వారికీ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఏటా 12.5 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.2,600కోట్లు వెచ్చిస్తోంది.
గుడ్ న్యూస్..విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు!
















Leave a Reply